'మిత్ర మండలి' మొదటి గీతం 'కత్తందుకో జానకి' విడుదల

'మిత్ర మండలి' మొదటి గీతం 'కత్తందుకో జానకి' విడుదల

5 months ago | 5 Views

బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది.

తాజాగా 'మిత్ర మండలి' నుంచి మొదటి గీతం 'కత్తందుకో జానకి'ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం(జూన్ 21) సాయంత్రం అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ లో జరిగింది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ 'కత్తందుకో జానకి'ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా అద్భుతమైన పాటగా మలిచారు. ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ గీతం.. వినసొంపుగా, అందరూ సరదాగా పాడుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ మరోసారి తన కలం బలం చూపించారు. ఈ సరదా గీతాన్ని ఎంతో అందంగా, అర్థవంతంగా వ్రాశారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.

'మిత్ర మండలి' మొదటి గీతం 'కత్తందుకో జానకి'కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రధాన పాత్రధారులు ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గీతం సాగింది. తమ గురించి తాము ఉల్లాసంగా పాడుతూ.. నేటి Gen Z అలవాట్లయిన రీల్స్, రిలేషన్స్, పబ్జీ గేమింగ్ ఇలా ప్రతిదానిని ప్రస్తావిస్తూ 'కత్తందుకో జానకి' గీతం నడిచిన తీరు కట్టిపడేసింది. ఓ వైపు యువత తమ అలవాట్లను చెప్పుకుంటుంటే, మరోవైపు తల్లిదండ్రులు వారిని తరుముతూ 'కత్తందుకో జానకి' అనడం ఆకట్టుకుంది.


అమలాపురం కిమ్స్ కాలేజ్ లో జరిగిన 'కత్తందుకో జానకి' గీతావిష్కరణ వేడుకకు ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరయ్యారు. అలాగే కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు, ఎండీ రవివర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు బన్నీ వాస్, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల, నటీనటులు ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, దర్శకుడు విజయేందర్ ఎస్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తదితరులు సందడి చేశారు.

'కత్తందుకో జానకి' గీతం యువత మెచ్చేలా ఉందని ప్రశంసించిన అతిథులు.. 'మిత్ర మండలి' సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా 'మిత్ర మండలి' సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'మిత్ర మండలి' చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మిత్ర మండలి

తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.

సంగీతం: ఆర్.ఆర్. ధృవన్

ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె

కూర్పు: పీకే

కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్

కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా

దర్శకత్వం: విజయేందర్ ఎస్

నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల

సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స

సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)

నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

ఇంకా చదవండి: "స్కై" సినిమా 'తపనే తెలుపగ..' లిరికల్ సాంగ్ విడుదల

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మిత్ర మండలి     # ప్రియదర్శి     # రాగ్ మయూర్    

trending

View More