'ఢీ' సీక్వెల్‌కు రేఢీ అంటున్న మంచు విష్ణు

'ఢీ' సీక్వెల్‌కు రేఢీ అంటున్న మంచు విష్ణు

5 months ago | 5 Views

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మంచు విష్ణు.  జూన్‌ 27న ఈ సినిమా విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు తన హిట్‌ సినిమా 'ఢీ’ సీక్వెల్‌ గురించి మాట్లాడారు.  'ఢీ’ సినిమా సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఆ సినిమా దర్శకుడు, నేను కలిసి సీక్వెల్‌ కోసం ప్రయత్నిస్తున్నాం.

నేను ఆ చిత్రాన్ని ఎంతో ప్రేమతో చేశాను. ఏదో ఒకరోజు దర్శకుడు దాని సీక్వెల్‌ స్క్రిప్ట్‌తో నన్ను కలవాలని కోరుకుంటున్నాను. అదంతా రచయిత చేతుల్లోనే ఉంటుంది. స్క్రిప్ట్‌ సిద్ధమైన మరుసటి రోజే దాని షూటింగ్‌ను ప్రారంభిస్తాను' అని మంచు విష్ణు తెలిపారు.శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు, జెనీలియా జంటగా నటించిన యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ 'ఢీ’.


శ్రీహరి, జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. 2007లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, మంచు విష్ణు కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. అలాగే తన మనసులో ఉన్న మరో కథను కూడా బయటపెట్టారు. ప్రస్తుతం తాను 'కన్నప్ప’  ప్రచారంలో బిజీగా ఉన్నట్లు చెప్పిన విష్ణు.. వేరే సినిమాలు ప్లాన్‌ చేయడం లేదని వెల్లడిరచారు. అయితే, 1947 నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ సినిమా చేయాలని తనకు ఎప్పటినుంచో ఆలోచన ఉందన్నారు. ఆ ఆలోచనను నిజం చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతేడాది విడుదలై హిట్‌ను సొంతం చేసుకున్న ఫహద్‌ ఫాజిల్‌ 'ఆవేశం’ సినిమా తెలుగు రీమేక్‌ చేయాలని అనుకున్నట్లు మంచు విష్ణు చెప్పారు. అయితే, అప్పటికే ఆ సినిమా రైట్స్‌ మరొకరు సొంతం చేసుకున్నారని అన్నారు.
ఇంకా చదవండి: విజయ్‌సేతుపతి- పూరి సినిమా టీమ్‌లో చేరిన సంయుక్త
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఢీ     # మంచు విష్ణు    

trending

View More