నా వ్యాఖ్యలు వక్రీకరిస్తే చేసేదేవిూ లేదు : నటుడు రాజేంద్ర ప్రసాద్
6 months ago | 5 Views
సీనియర్ నటుడు రాజేందప్రసాద్ నటించిన తాజా చిత్రం 'షష్టిపూర్తి’ 'లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత ఆయన, అర్చన ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకువచ్చింది. తాజాగా ఈ టీమ్ సక్సెస్ విూట్ను నిర్వహించింది. అందులో రాజేందప్రసాద్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సరదాగా ఉంటానని అన్నారు. ఇళయరాజా పుట్టినరోజు నాడు ఈ సినిమా సక్సెస్ విూట్ నిర్వహించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు నేనంటే ఎంతో అభిమానం, ప్రేమ. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో నేను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది విూ సంస్కారం విూద ఆధారపడి ఉంటుంది. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం విూ ఖర్మ. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను. విూడియాను నా కుటుంబంగా భావిస్తాను. నన్ను విూరంతా అన్నయ్య అని పిలవడం నా అదృష్టం అన్నారు.
ఈ మధ్య ఓ కార్యక్రమంలో నేను పరిచయం చేసిన హీరోయిన్, యాక్టర్ గురించి సరదాగా మాట్లాడాను. వాటిని తప్పుగా అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. పెళ్లిపుస్తకం నుంచి షష్టిపూర్తి వరకూ కెరీర్ సక్సెస్ఫుల్గా నడిచింది. విూ అందరూ ఈ సినిమాను అదరించినందుకు ధన్యవాదాలు. మనం నటించే సినిమాల్లో మనం కనిపించకూడదు.. పాత్రలే కనిపించాలి. నాతో వర్క్ చేసిన నటీనటులంతా నాతో సరదాగానే ఉంటారు. అందులో తప్పేం లేదు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చింది. అది దేవుడిచ్చిన వరం. నిజ జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటామో.. సినిమాల్లోని పాత్రల్లో వచ్చే వాటిని కూడా ఎదుర్కోవాలి. అది ఆర్టిస్టుల బాధ్యత. షష్టిపూర్తిలో నా బాధ్యతను నిర్వర్తించాను. విూరంతా ఆదరించారు. ఇలాంటి పాత్రలే చివరి శ్వాస వరకూ చేయాలని కోరుకుంటాను. నాపై అభిమానం చూపుతున్న అందరికీ పాదాభివందనం అని తెలిపారు.
ఇంకా చదవండి: ‘షష్టిపూర్తి’ టీమ్ ని అభినందించిన ఇళయరాజా
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# షష్టిపూర్తి # రాజేంద్ర ప్రసాద్ # అర్చన




