'గోపి గాళ్ల  గోవా ట్రిప్' ప్రీ రిలీజ్ ఈవెంట్

'గోపి గాళ్ల గోవా ట్రిప్' ప్రీ రిలీజ్ ఈవెంట్

21 days ago | 5 Views

తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. అలానే ఒరిజినాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలకి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలా వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇక తెలుగులో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ రోహిత్ మరియు క్యాంప్ శశి గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్లు చేసిన ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా వీళ్ళ వర్క్ చూసి ఫిదా అవుతుంటారు. స్టోరీ డిస్కషన్స్, నిరుద్యోగ నటులు వంటి సిరీస్ వీళ్లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించిన 'గోపి గాళ్ల గోవా ట్రిప్'. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ రోహిత్ మరియు శశి , మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్, నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా  డైరెక్టర్ రోహిత్ అండ్ శశి మాట్లాడుతూ... ఈ సినిమాకి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లు. ఈ సినిమాను మొదటిసారి మొదలుపెట్టారు. ఈ ఐడియా చెప్పిన 15 రోజు షూటింగ్ లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని ఒక రిమోట్ విలేజ్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది.


ఇది ఒక రకమైన రూట్ ఫిలిం. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ మధ్యలో షూటింగ్ చేసాం ఎక్కడ పర్మిషన్ లు కూడా లేవు. సినిమా 90% సినిమా అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఇది చిల్డ్ బీర్ లాంటి మూవీ. ఇలాంటి మూవీని మీడియా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) మాట్లాడుతూ... జగదీష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది తను నటించిన నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్. దానికి రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పుష్ప సినిమా విపరీతమైన గుర్తింపు సాధించింది. వరంగల్ నుంచి హైదరాబాద్ కి సినిమాలు చూడడానికి వచ్చిన జగదీష్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో సెటిల్ అయిపోయాడు. ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది అందరూ చూసి ఎంకరేజ్ చేయండి అంటూ కోరారు.  నటుడు సాయికుమార్ మాట్లాడుతూ... ఈ సినిమా అనేది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మాగ్నమోపస్ లాంటిది. అంటూ ఎలివేషన్ తెలిపాడు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ అందరూ ఎంకరేజ్ చేయాలి అని కోరుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్ మరియు నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాను ఎంకరేజ్ చేయాలి అని ఆడియన్స్‌ ను కోరారు.  'గోపి గాళ్ల గోవా ట్రిప్' సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 14న ఏ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఇంకా చదవండి: 'సంతాన ప్రాప్తిరస్తు' చూశాక మంచి తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది : డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# గోపి గాళ్ల గోవా ట్రిప్     # రోహిత్    

trending

View More