రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై రచ్చ వద్దు : సోషల్ విూడియా ప్రచారాలపై నటుడు అలీ
6 months ago | 5 Views
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా, కామెడీ కింగ్గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ విూడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ వివాదంపై కమెడియన్ అలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, రాజేంద్ర ప్రసాద్ను సమర్థిస్తూ విూడియాను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ గారికి మాట తూలింది. సరదాగా అన్నారు, దీన్ని తీసుకుని విూడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్, ఆయన ద్ణుఖంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. కావాలని ఈ విషయంలో రచ్చ చేయకండి, ఆయన పెద్దాయన అని అన్నారు. అలీ ఈ స్పందనలో రాజేంద్ర ప్రసాద్ను సమర్థిస్తూ, ఆయన వ్యాఖ్యలు సరదాగా చేసినవేనని, దాన్ని అతిగా పెద్దది చేయొద్దని విూడియాను కోరారు.
ఇంకా చదవండి: ‘రానా నాయుడు సీజన్ 2’లో నాగ నాయుడు పాత్ర గురించి చెప్పిన వెంకటేష్ దగ్గుబాటి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అలీ # రాజేంద్రప్రసాద్




