రాజమౌళి సినిమాలో విలన్‌ పాత్ర సున్నితంగా తిరస్కరించిన విక్రమ్‌

రాజమౌళి సినిమాలో విలన్‌ పాత్ర సున్నితంగా తిరస్కరించిన విక్రమ్‌

5 months ago | 5 Views

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ లో రాజమౌళి- మహేశ్‌ ప్రాజెక్ట్‌ ఒకటి. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో అగ్ర తారలు ఇందులో భాగం కానున్నారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్‌ అవుతుంది. ఏంటంటే.. తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ ను  ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్‌ చేశారట. అది విలన్‌ పాత్ర కావడంతో ఆయన నో చెప్పారని సమాచారం. విక్రమ్‌ విలన్‌ రోల్‌ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ అవకాశాన్ని రిజెక్ట్‌ చేశారని టాక్‌. 


దీంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రజంట్‌ ఈ వార్త వైరల్‌ గా మారింది. ఇక ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నప్పటికీ. ఇంతవరకు ఈ చిత్రంలోని ఒక్క పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా.. ఇందులో ఆర్‌.మాధవన్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు కూడా ఇటీవల టాక్‌ వినిపించింది. త్వరలోనే ఆయన సెట్స్‌ లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజంట్‌ మాధవన్‌ కూడా డిఫరెంట్‌ కంటెంట్ ను ఎంచుకుంటు మంచి మంచి సినిమాలు సిరీస్‌లో నటిస్తూ ఫామ్‌ లోనే ఉన్నారు. కానీ దీని గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇంకా చదవండి: ‘బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో రవి మోహన్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రాజమౌళి     # మహేశ్‌     # విక్రమ్‌    

trending

View More