అవతార్: ది వే ఆఫ్ వాటర్ రీ-రిలీజ్ – అక్టోబర్ 2
3 months ago | 5 Views
అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్తో 20th Century Studios వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్పీస్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2, 2025 న భారతీయ థియేటర్స్లో ఒక వారం పాటు 3D లో రీ-రిలీజ్ కానుంది.
ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్లో విడుదలై, అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది.
ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ మళ్లీ 3Dలో చూడటం ద్వారా, పాండోరా అద్భుతమైన అండర్వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీ హృదయానికి హత్తుకునే కథను పెద్ద తెరపై తిరిగి అనుభవించే అవకాశముంది.
“ఈ అవకాశం మిస్ అవ్వకండి. మీరు ముందే ఈ మంత్ర ముగ్ధమైన లోకాన్ని చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా – ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th Century Studios ఇండియా ప్రతినిధులు తెలిపారు.
అక్టోబర్ 2, 2025 నుంచి ఒక వారం పాటు, భారతీయ థియేటర్స్లో – 3Dలో అవతార్: ది వే ఆఫ్ వాటర్!
ఇంకా చదవండి: సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్న విష్ణు మంచు రీసెంట్ డివైన్ బ్లాక్ బస్టర్ ‘కన్నప్ప'
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




