ముగింపు దశకు 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్..

ముగింపు దశకు 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్..

14 days ago | 12 Views

టాలీవుడ్‌ నుంచి వస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌లో 'డబుల్‌ ఇస్మార్ట్‌’ఒకటి. ఎనర్జిటిక్‌ యాక్టర్‌ రామ్‌ పోతినేని , డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండగా.. ఈ ఇద్దరి కలయిలకలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరక్కుతోంది.  ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్‌ ముంబైలో స్టార్ట్‌ అయినట్లు చిత్రయూనిట్‌ తెలిపింది.

పూరీ ముంబైలో 'డబుల్‌ ఇస్మార్ట్‌' క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ ప్లాన్‌ చేశాడని.. ఈ సీన్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని టాక్‌.ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్‌ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన మణిశర్మ సీక్వెల్‌కు అదిరిపోయే ఆల్బమ్‌ రెడీ చేస్తున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌ టాక్‌. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను పాపులర్‌ మ్యూజిక్‌ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ దక్కించుకుంది.

ఇంకా చదవండి: మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా.. 'దేవకీ నందన వాసుదేవ' టైటిల్‌ ఖరారు!

# DoubleiSmart     # PuriJagannadh     # AnushkaShetty     # RamPothineni     # TeluguCinema    

trending