"ప్రేమ్చంద్ మానవతావాదం ఎవరికైనా అర్థమయ్యే భాషను మాట్లాడుతుంది": వివాన్ షా
14 days ago | 20 Views
తన తల్లిదండ్రులు నసీరుద్దీన్ షా మరియు రత్న పాఠక్ షా 'మోత్లీ ప్రొడక్షన్స్' అనే నాటక బృందంలో వెచ్చించిన సమయాన్ని, అభిరుచిని గమనించిన వివాన్ షాకు ఒక నాటకాన్ని ప్రదర్శించడానికి అవసరమైన క్రమశిక్షణ, పడాల్సిన కష్టాలు కొత్త కాదు. "ఇస్మత్ చుగ్తాయ్, మంటో మరియు అనేక మంది కథలను ప్రదర్శించిన నా తల్లిదండ్రుల కారణంగా, భారతీయ సాహిత్యంలోని సంపద గురించి నాకు తెలుసు. ప్రేమ్ చంద్ అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం మరియు అతని కథ 'గుల్లీ దండా' నేను చదివిన అతని సున్నితమైన, కదిలించే కథలలో ఒకటి. సీమా పహ్వా దర్శకత్వం వహించిన జీ థియేటర్ వారి 'కోయి బాత్ చలే'లో భాగం కావడం చాలా ఆనందంగా, గౌరవంగా, అదృష్టంగా అనిపించింది. ప్రేమ్ చంద్ మానవతావాదం ఎవరికైనా అర్థమయ్యే భాషను మాట్లాడుతుంది, ఈ కథను ఇప్పుడు తెలుగులోకి అనువదించినందుకు సంతోషంగా ఉంది.
ఒక క్లాసిక్ కథను సరైన శృతిలో చెప్పడం, ఎక్కువ ప్రాప్స్ లేకుండా బహుళ పాత్రలు పోషించడం సవాలుతో కూడుకున్నదే అయినా ప్రత్యేకంగా 'గుల్లీ దండా' అనే కథలో ఆత్మను ఆవిష్కరించడాన్ని ఆస్వాదించానని వివాన్ అన్నారు. "ప్రేమ్చంద్ మనం విస్మరించే వర్గ విభేదాలను, సామాజిక అసమానతలను చాలా సున్నితంగా వెల్లడిస్తాడు. దాన్ని బయటకు తీసుకురావడానికి, పాత్రలు, గద్యంలోని సూక్ష్మాంశాలకు న్యాయం చేయడానికి సీమ గారు నాకు సహాయపడ్డారు.’’ అని చెప్పారు.